Flipkart Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ మొదలైంది.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Flipkart Mobile Bonanza Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Mobile Bonanza Sale begins _ Discount offers on Poco X5 Pro, Samsung Galaxy M14, and more

Flipkart Mobile Bonanza Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ మొదలైంది. గత నెలలో దీపావళి సేల్‌ ముగిసిన కొన్ని వారాల తర్వాత కొత్త ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్ మొదలైంది. ఈ సేల్ డిసెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

అందులో పోకో ఎక్స్5 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం14, మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 2023 దీపావళి సేల్ మాదిరిగా లేటెస్ట్ సేల్ ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. గత విక్రయాలను కోల్పోయిన వినియోగదారులు ఇప్పటికీ తగ్గింపు ఆఫర్‌లను పొందవచ్చు. నథింగ్ ఫోన్ (2), శాంసంగ్ గెలాక్సీ ఎం14, పోకో ఎక్స్5 ప్రో వంటి ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను పొందవచ్చు.

Read Also : ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

ఫ్లిప్‌కార్ట్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై మరింత తగ్గింపు :
భారత మార్కెట్లో పోకో ఎక్స్5 ప్రో మోడల్ రూ. 22,999 ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సమయంలో ఈ ఫోన్ భారీ తగ్గింపుతో ధర రూ. 18,999కి అమ్మకానికి ఉంది. అంటే.. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రూ. 4వేల తగ్గింపును ఇస్తోంది. రూ. 30వేల నుంచి రూ. 40వేల ధరల శ్రేణిలో ఏ ఫోన్‌లోనూ హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్‌సెట్‌ను అందించడం లేదు. కానీ, ప్రస్తుతం రూ. 20వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో పోకో ఎక్స్ 5 ప్రో మోడల్ ఇదొకటిగా చెప్పవచ్చు.

మరెన్నో ఆకర్షణీయమైన బ్యాంకు ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (2)ని రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ 5జీ డివైజ్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 44,999కి లాంచ్ అయింది. అంటే.. నథింగ్ ఫోన్ (2)పై రూ. 5వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.

Flipkart Mobile Bonanza Sale

అదేవిధంగా, లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎం14 కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,399కు సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్‌లో బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, మీ బడ్జెట్ రూ. 15వేల లోపు ఉంటే.. ప్రస్తుతం అత్యుత్తమ ఫోన్ డీల్స్‌లో ఇదొకటిగా చెప్పవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో మరెన్నో ఇతర డీల్స్ :
రూ. 30వేల లోపు అత్యుత్తమ 5జీ ఫోన్‌లలో మోటరోలా ఎడ్జ్ 40 ఒకటి.. ప్రస్తుత ఈ మోటోరోలా 5జీ ఫోన్ ధర తగ్గింది. వినియోగదారులు ఈ ఫోన్ ధరను రూ.26,999 వద్ద పొందవచ్చు. ఈ ధర అసలు ధర రూ. 29,999 నుంచి తగ్గింది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వినియోగదారులు ఈ మోటరోలా ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఐపీ68 వాటర్-రెసిస్టెంట్ రేట్ కలిగి ఉంది. ప్రీమియం లెదర్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉంది. చివరగా, రెడ్‌మి 12సి తక్కువ ధర రూ. 6,799 వద్ద లిస్టు అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఇతర డీల్‌లను కూడా చెక్ చేయవచ్చు.

Read Also : Nothing Phone 2 Price Cut : భారత్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు