Flipkart Mobile Bonanza Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ మళ్లీ ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. సేల్ సమయంలో అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ సేల్ సందర్భంగా పోకో ఎక్స్6, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, మోటోరోలా ఎడ్జ్ 40 నియో మరిన్నింటిపై మంచి డీల్లను అందిస్తోంది. అందులో కొన్ని మాత్రమే ఫ్లాట్ డిస్కౌంట్లను పొందవచ్చు. కొన్ని ఫోన్ డీల్లపై బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ సేల్ ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఏయే స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 15, పోకో ఎక్స్6 ఫోన్లపై భారీ తగ్గింపు :
పోకో ఎక్స్6 ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999తో లాంచ్ అయింది. కానీ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో వినియోగదారులు రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధరను రూ.19,999కి తగ్గుతుంది. అదేవిధంగా, డీబీఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని కలిగి ఉంటే. మోటోరోలా ఎడ్జ్ 40 నియో మోడల్ రూ.21,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ అసలు ధర రూ. 22,999గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్పై రూ. 1,500 తగ్గింపు పొందవచ్చు. అనేక ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు. ఆసక్తి గల వినియోగదారులు ఫ్లిప్కార్ట్లో చెక్ చేయవచ్చు.
లేటెస్ట్ ఐఫోన్ 15 కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే.. లాంచ్ అయిన 5 నెలల తర్వాత కూడా ఇప్పటికీ ఈ ఫోన్ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.66,999కి అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఐఫోన్ 15 రూ. 79,900 ధర ట్యాగ్తో గత ఏడాదిలో లాంచ్ అయింది. వినియోగదారులు రూ. 12,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
చౌకైన ధరకే ఐఫోన్ 13 మోడల్ :
చౌకైన ధరలో ఐఫోన్ కావాలనుకుంటే ఆపిల్ ఐఫోన్ 13ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సమయంలో రూ. 52,999కి విక్రయిస్తోంది. ఐఫోన్ 14 రూ. 57,999కి అమ్మకానికి ఉంది. అయితే, రెండు ఫోన్లలో పర్ఫార్మెన్స్ ఒకే విధంగా ఉండటంతో అదనంగా రూ. 5వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు.
బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉన్న ఇబ్బంది లేదనుకుంటే.. బెస్ట్ ఐఓఎస్ కలిగిన ఐఫోన్ 15 ప్రో లేదా ఐఫోన్ మ్యాక్స్ మోడల్ని కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్రో రూ. 1,27,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అయితే, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ. 1,48,900కి కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 మ్యాక్స్ మోడల్పై రూ.11వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.