UPI One World Wallet
UPI One World Wallet : విదేశీయులకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ భారతీయులే కాదు.. విదేశీయులు కూడా భారత్ కు వచ్చినప్పుడు ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు. విదేశీ అతిథుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సర్వీసును విస్తరించింది.
భారత డిజిటల్ విప్లవం ఇకపై భారతీయులకే పరిమితం కాదు. ఇతర దేశాల అతిథులకు కూడా అందుబాటులో ఉంటుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా 40 కన్నా ఎక్కువ దేశాల నుంచి వచ్చే అతిథులు భారతీయ బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్ లేకుండా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు.
విదేశీ అతిథుల కోసం NPCI ‘యూపీఐ వన్ వరల్డ్’ వాలెట్ సర్వీసును ప్రారంభించింది. భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులు యూపీఐ ఉపయోగించి దేశంలో అన్ని ఆన్ లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు. క్యాష్, విదేశీ కరెన్సీ ఎక్స్ఛేంజ్ వంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు, మనలాగే విదేశీయులు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా రియల్-టైమ్ పేమెంట్లు చేయవచ్చు.
యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ ఏంటి? :
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్. విదేశీ ప్రయాణికులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో లేదా భారత్ మండపం వద్ద NPCI పెవిలియన్లో ఈజీగా పొందవచ్చు. భారతీయ సిమ్ కార్డ్ అవసరం లేదు. సేఫ్ డిజిటల్ వ్యాలెట్.
విదేశీ ప్రయాణికులు తమ అంతర్జాతీయ కార్డుల నుంచి కూడా క్యాష్ లోడ్ చేసుకోవచ్చు. ట్రిప్ చివరిలో వ్యాలెట్ ఫండ్స్ మిగిలి ఉంటే నిబంధనల ప్రకారమే ఆ డబ్బును తిరిగి ఒరిజినల్ అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
NPCI డేటా ప్రకారం.. గత జనవరి 2026లో యూపీఐ రూ.28.33 లక్షల కోట్ల (సుమారు 312 బిలియన్ డాలర్లు) విలువైన 21.70 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ ఎన్పీసీఐ దేశంలో రిటైల్ పేమెంట్లను నిర్వహిస్తుంది. ఈ పోర్ట్ఫోలియోలో UPI, RuPay, IMPS, NACH, AePS వంటి ప్రొడక్టులు ఉన్నాయి.
లావాదేవీ పరిమితి ఎంతంటే? :
అతిథుల సౌలభ్యం కోసం ఈ యూపీఐ వన్ వరల్డ్ వాలెట్ ప్రతి లావాదేవీకి రూ. 25వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా నెలవారీ లోడింగ్ లిమిట్ రూ. 50వరకు ఉంటుంది. భారత డిజిటల్ సిస్టమ్ ప్రపంచానికి అందించడమే కాకుండా “అతిథి దేవో భవ” అనే సంప్రదాయాన్ని మోడ్రాన్ టెక్నాలజీతో ఒకటి చేస్తుంది.
“యూపీఐ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో విదేశీ అతిథులకు ‘యూపీఐ వన్ వరల్డ్’ సర్వీసును విస్తరించింది. భారత రియల్-టైమ్ పేమెంట్ ఎన్విరాన్ మెంట్ సిస్టమ్, ‘మేడ్ ఇన్ ఇండియా’ టెక్నాలజీని యాక్సస్ చేసే అవకాశాన్ని విదేశీయులకు అందిస్తున్నాం” అని NPCI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (గ్రోత్) సోహిని రాజోలా అన్నారు.