Call Merging Scam
Call Merging Scam : యూపీఐ యూజర్లకు అలర్ట్.. కొత్త కాల్ మెర్జింగ్ స్కామ్తో జాగ్రత్త.. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారంటే అంతే సంగతులు.. స్కామర్లు ఏ క్షణమైనా మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు కాజేయొచ్చు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ తమ యూజర్లను కొత్త స్కామ్ గురించి అప్రమత్తం చేస్తోంది. ఇందులో స్కామర్లు వినియోగదారులను మోసగించి కాల్స్ మెర్జ్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే వన్-టైమ్ పాస్వర్డ్లను (OTP) షేర్ చేస్తారు. స్కామర్లు అనధికార లావాదేవీలతో మీ అకౌంట్లలో డబ్బును దొంగిలిస్తారు.
ఈ కొత్త స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఎక్స్ వేదికగా యూజర్లను హెచ్చరించింది, “స్కామర్లు యూపీఐ ఓటీపీల కోసం మిమ్మల్ని మోసగించేందుకు కాల్ మెర్జింగ్ను ఉపయోగిస్తున్నారు. స్కామర్ల వలలో పడకండి. అప్రమత్తంగా ఉండండి. మీ డబ్బును కాపాడుకోండి.” అంటూ పోస్టులో హెచ్చరించింది.
కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి? :
ఈ స్కామ్ అనేది ఒక గుర్తు తెలియని వ్యక్తి.. మీ ఫోన్ నంబర్ను స్నేహితుడి నుంచి తీసుకుని కాల్ చేస్తున్నట్టుగా చెబుతాడు. ఆ తర్వాత స్కామర్ ఆ “స్నేహితుడు” వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని పేర్కొంటూ, కాల్స్ మెర్జ్ చేయమని అడుగుతాడు.
Scammers are using call merging to trick you into revealing OTPs. Don’t fall for it! Stay alert and protect your money. 🚨💳 Share this post to spread awareness!#UPI #CyberSecurity #FraudPrevention #StaySafe #OnlineFraudAwareness #SecurePayments pic.twitter.com/kZ3TmbyVag
— UPI (@UPI_NPCI) February 14, 2025
కాల్ మెర్జ్ అయిన తర్వాత, యూపీఐ యూజర్లకు తెలియకుండానే వారి బ్యాంక్ లింక్ అయిన అకౌంట్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్తో కనెక్ట్ అవుతారు. స్కామర్లు అదే సమయంలో మీ ఓటీపీని స్కాన్ చేస్తారు. కాల్ ద్వారా ఓటీపీ వినేస్తారు అనమాట. ఓటీపీ పొందిన వెంటనే మోసగాళ్ళు మీ బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బులను కాజేస్తారు.
కాల్ మెర్జ్ స్కామ్ నుంచి సేఫ్గా ఎలా ఉండాలంటే? :
ఈ స్కామ్ బారిన పడకుండా ఉండటానికి యూపీఐ సెక్యూరిటీ టిప్స జారీ చేసింది. అవేంటో ఓసారి జాగ్రత్తగా చదవండి.
గత నెలలో జరిగిన ఒక సర్వేలో భారత్లో మూడింట ఒక వంతు మంది రియల్-టైమ్ పేమెంట్లకు సంబంధించిన మోసాలకు గురయ్యారని తేలింది. గ్లోబల్ అనలిటిక్స్ కంపెనీ (FICO) నివేదిక దేశంలో పెరుగుతున్న మోసాల ముప్పును హైలైట్ చేసింది.
60 శాతం మందికి స్కామ్ మెసేజ్లు వచ్చాయని, 54 శాతం మందికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మోసపోయినట్లు తెలుసని తేలింది. 2023తో పోలిస్తే.. 2024లో తక్కువ మంది వినియోగదారులు డబ్బును నష్టపోగా రూ.8 లక్షలకు పైగా నష్టాల విలువ 2 శాతం నుంచి 4 శాతానికి రెట్టింపు అయింది.