Bandi Sanjay : ఢిల్లీలోనే బండి… మరోసారి ముఖ్యనాయకులతో భేటీ

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ తో మరోసారి భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితులపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసి, జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాలపై వారు  చర్చిస్తారు.

ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విషయాలపై వారు రాష్ట్ర అధ్యక్షుడికి పలు సూచనలు చేయనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వారు కార్యచరణ రూపోందించే అవకాశం ఉంది.

తెలంగాణ ఉద్యమనాయకులను బీజేపీలోకి చేర్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వారు చర్చించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ ఎప్పుడు రాజీనామా చేయాలి.. రాజీనామా తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణ వంటి పలు అంశాలపై బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్ కు దిశానిర్దేశం చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు