బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం

  • Publish Date - November 24, 2020 / 01:32 PM IST

Bjp Leader Bandi Sanjay:బీజేపీ అభ్యర్ధి మేయర్ అయిన తర్వాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం అంటూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రామాంతపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సంజయ్.. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.



ఈ ప్రచారంలో ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన సంజయ్.. బీజేపీ అభ్యర్థి మేయర్ అయిన తర్వాత రోహింగ్యాలను ఏరివేస్తాం అని అన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయం పాకిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు.



https://10tv.in/what-is-the-reson-behind-janasena-pawan-kalyan-delhi-tour/
రోహింగ్యాలు లేని ఎన్నికలు జరగాలని అది బీజేపీ వల్లే సాధ్యం అవుతుందని అన్నారు. రోహింగ్యాల ఓటర్లు లేని ఎన్నికలు, పాకిస్తాన్ ఓటర్లు లేని ఎన్నికలు హైదరాబాద్‌లో జరగాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు