కేవలం హిందువుల నిర్మాణాలనే కూలుస్తున్నారు, ఒవైసీ సంస్థలను టచ్ చేసే ధైర్యం లేదా..?: హైడ్రా కమిషనర్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.

Alleti Maheshwar Reddy (Photo Credit : Facebook, Google)

Alleti Maheshwar Reddy : హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్న మహేశ్వర్ రెడ్డి.. హైడ్రా పేరుతో లేని పోని హైక్ ను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కమిషనరా..? లేక పొలిటికల్ లీడరా..? అనే సందేహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిషనర్ రంగనాథ్ పొలిటీషియన్ లా మాట్లాడారని, ఆయన తీరు చూస్తుంటే పబ్లిసిటీ కోసం పని చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.

కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. అంతేకాదు.. కేవలం హిందువుల నిర్మాణాలనే కూలుస్తున్నారని, హైడ్రా పేరుతో పెద్దఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఓల్డ్ సిటీలోకి వెళ్ళే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా..? ఒవైసీని ఢీకొట్టేందుకు ధైర్యం సరిపోవడం లేదా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.

హైడ్రా పేరుతో లేని పోని హైక్ ను సృష్టిస్తున్నారు. రంగనాథ్ కమిషనరా..? పొలిటికల్ లీడరా..? ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటీషియన్ లా మాట్లాడారు. పబ్లిసిటీ కోసం రంగనాథ్ పని చేస్తున్నారు. కమిషనర్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలి. కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా..? ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారు. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సలకం చెరువులో ఒవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్తి రాజేశ్వర్ రెడ్డికి వర్తించవా..?

ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం విద్యా సంవత్సరం నడుస్తోందని.. విద్యార్థులు నష్టపోవద్దనే ఒవైసీకి 6 నెలల సమయం ఇస్తున్నాం అని రంగనాథ్ చెప్పారు. మరి మిగతా వారికి ఎందుకు సమయం ఇవ్వలేదు? నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు ఎందుకు సమయం ఇవ్వలేదు..? ఓల్డ్ సిటీలోకి వెళ్ళే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా..? ఒవైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా..? ఒవైసీ సంస్థల్లో మాత్రమే విద్యార్థులున్నారా..? రంగనాథ్ కు ఆఫర్ ఇచ్చారేమో? అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్ళడం లేదు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కుల్చుతున్నారా అనే అనుమానం కలుగుతుంది.

కాంగ్రెస్ సర్కార్ స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది. 100 శాతం చెరువు కబ్జా అయితే ముట్టుకోమని రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హైసెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ హైప్ ఏంది..? ఈ హైడ్రా ఏంది? అర్థం కావడం లేదు. తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకున్న పోలీస్ అధికారులు ఎంతోమంది ఉన్నారు. వారికి లేని సెక్యూరిటీ రంగనాథ్ కు ఎందుకు..?

Also Read : నెక్ట్స్ టార్గెట్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే టార్గెట్ గా పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఓల్డ్ సిటీలోకి వెళ్లేందుకు హైడ్రాకు దారి తెలవడం లేదా..? డిస్క్రిమినేషన్ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతులతో వెళ్తే రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం. రంగనాథ్ కు ఎమ్మెల్సీ ఇచ్చుకోండి, రాజ్యసభ ఇచ్చుకోండి. కానీ ఇంత హైప్ ఎందుకు చేస్తున్నారు? ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒవైసీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఒవైసీ నిర్మాణాలను ముట్టుకోలేకపోతున్నారు. సలకం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాతే ఇతర చెరువులకు వెళ్ళాలి. పాతబస్తీలో ఎన్ని చెరువులున్నాయి? ఎన్ని ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి? అనే డేటాను ప్రభుత్వం సేకరించాలి” అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు