×
Ad

BJP MLA Raja Singh : డీజీపీ, హైదరాబాద్ సీపీ ఏం చేస్తున్నారు? రాజాసింగ్ ఆగ్రహం

హైదరాబాద్ లోని  భోలక్‌పూర్ కార్పోరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై   ఘోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ

  • Published On : April 6, 2022 / 02:59 PM IST

Bjp Mla Raja Singh

BJP MLA Raja Singh : హైదరాబాద్ లోని  భోలక్‌పూర్ కార్పోరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై   ఘోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.

లా అండ్ ఆర్డర్ కేటీఆర్ చేతిలో ఉందా? హోం మంత్రి చేతిలో ఉందా ? కేటీఆర్ ట్వీట్ చేయకపోతే అరెస్ట్ చేయరా ? డీజీపీ, హైదరాబాద్ సీపీ ఏం చేస్తున్నారు ? అంటూ  ప్రశ్నించారు.  ఘటన జరిగి రెండు రోజులైనా కార్పోరేటర్ పై కేసుఎందుకు బుక్ చేయలేదు. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత కేసు బుక్ చేస్తారా అని ఆయన అన్నారు.
Also Read : Pakistan : ఇమ్రాన్ ఖాన్ కు మరో ట్విస్టు- దేశం విడిచి పారిపోయిన భార్య ఫ్రెండ్

సామాన్య ప్రజలు ఇలా మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారా… థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైలులో వేస్తారు. ఎంఐఎం వాళ్లు ఏం చేసినా కేసులు పెట్టోద్దని ప్రభుత్వం పోలీసులకు ముందే చెప్పిందని రాజాసింగ్ ఆరోపించారు.