Pakistan : ఇమ్రాన్ ఖాన్ కు మరో ట్విస్టు- దేశం విడిచి పారిపోయిన భార్య ఫ్రెండ్
పాకిస్తాన్ లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆయనతో పరచయాలు ఉన్న సన్నిహితులు దేశం విడిచి వెళ్లిపోతున్నారని
Pakistan : పాకిస్తాన్ లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆయనతో పరచయాలు ఉన్న సన్నిహితులు దేశం విడిచి వెళ్లిపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో మూడు నెలల్లో ముందస్తు ఎన్నికలు అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించగా… ఎన్నికల కోసం కనీసం ఆరు నెలల గడువైనా అవసరం అని ఎన్నికల సంఘం ప్రతిస్పందించింది.
ఇదిలా ఉండగా పాక్ లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇమ్రాన్ మూడో భార్య బుష్రాబీబీ స్నేహితురాలు ఫరాహ్ ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. ఆమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె దేశం విడిచి వెళ్ళిపోవటంతో ఇప్పుడు ఆమె ట్రెండింగ్ లో నిలిచారు. ఇమ్రాన్ ఖాన్ మూడో భార్యను అడ్డుపెట్టుకుని ఫరాహ్ ఖాన్ దేశంలో భారీ అవినీతికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోవటంతో ఫరాహ్ ఖాన్ దేశం విడిచి వెళ్ళింది.
Also Read : China Daily Covid Cases : చైనా, యుకేలో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు..!
దుబాయ్ వెళ్తున్న సమయంలో ఆమె వద్ద ఉన్న బ్యాగు గురించి ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆ బ్యాగ్ చాలా విలువైనది. దాని విలువ సుమారు 90 వేల డాలర్లు అని తెలుస్తోంది. విమానంలో బ్యాగుతో వెళుతున్న ఫోటోలు వైరల్ కావటంతో ఫరాహ్ ఖాన్ అవినీతి చరిత్ర బయటపడుతోంది. ఇమ్రాన్ మూడో భార్య బుష్రా బీబీని అడ్డుపెట్టుకుని ఫరాహ్ ఖాన్ అవినీతికి పాల్పడిందని పీఎంఎల్ నవాజ్ పార్టీ నేత కుర్షీద్ ఆలమ్ ఆరోపించారు.
ప్రభుత్వ ఆఫీసర్ల బదిలీల కోసం వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె సుమారు 6 బిలియన్ల పాకిస్తానీ రూపాయలును వసూలు చేసినట్లు పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పేర్కోన్నారు. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకుంటే వారి అనుయాయులు చేసిన నేరాలు బయటపడతాయని భయపడుతున్నారని ఆమె అన్నారు.