కొన్ని వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ న్యూఢిల్లీ నుంచి తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్ లిస్ట్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజిగిరి నుంచి చాలా మంది పోటీ పడ్డారు. చివరకు ఈటల రాజేందర్ కు టికెట్ దక్కింది. బీబీ పాటిల్కు బీజేపీలో చేరిన తదుపరి రోజే టికెట్ దక్కింది.
బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదాన్ని తీసుకెళుతోంది. తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నేత సోయం బాపూరావు ఉన్నారు. ఎల్లుండి ఆదిలాబాద్ కు నరేంద్ర మోదీ వస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎంపీ సీటుపై అధిష్ఠానం ఎటూ తేల్చలేదు.
రకరకాల ఊహాగానాల మధ్య మల్కాజ్గిరి సీటును దక్కించుకున్నారు ఈటల రాజేందర్. మల్కాజ్గిరి టికెట్ ఆశించి సీనియర్ నేత మురళీధరరావు, మల్క కొమరయ్య, పన్నల హరీశ్ రెడ్డి నిరాశకు గురయ్యారు. మహబూబ్నగర్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది బీజేపీ. మహబూబ్నగర్ సీటు కోసం డీకే.అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ ఉంది. నాగర్కర్నూల్ సీటును తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్నారు ఎంపీ రాములు.
9 స్థానాల్లో అభ్యర్థులు వీరే..