KCR: ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ బిగ్ ఆఫర్.. అసెంబ్లీ వ్యూహాలపై సుదీర్ఘ చర్చ

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR) అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

BRSLP meeting was held at Errabelli residence, presided over by KCR

  • ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ కీలక భేటీ
  • ఎమ్మెల్యేలకు కేసీఆర్ పక్కా దిశానిర్దేశం
  • అసెంబ్లీలో కాంగ్రెస్‌పై పోరాటానికి స్కెచ్

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని స్వగృహంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR)అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ పాల్గొని సభలో అనుసరించాల్సిన శైలిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

Satya Niketan Tragedy: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు!

అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాటానికి పక్కా స్కెచ్: నేతలకు బిగ్ అలర్ట్!

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల అమలు, రైతాంగ సమస్యలపై గట్టిగా ఎండగట్టాలని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సభలో ప్రజా సమస్యల తీవ్రతను ప్రముఖంగా లేవనెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు వీలుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన సభ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ వరకు గళమెత్తడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రజాపోరాటాన్ని తీవ్రతరం చేయబోతోందని ఈ భేటీ ద్వారా తేటతెల్లమవుతోంది.