Raja Singh: ఫాతిమా‌ కళాశాలను అందుకే కూల్చడం లేదా? ఎప్పుడు కూల్చుతారు?: రాజాసింగ్

ఫాతిమా కాలేజ్‌ను కాపాడుతోన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం జీరోనే అని వ్యాఖ్యానించారు.

MLA Raja Singh

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా‌ కళాశాలను ఎప్పుడు కూల్చుతారో చెప్పాలని నిలదీశారు. అక్రమ నిర్మాణమైన ఒవైసీ కాలేజీను కూల్చితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అవుతారని అన్నారు.

ఫాతిమా కాలేజ్‌ను కాపాడుతోన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం జీరోనే అని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో ఒప్పందం కుదిరినందునే ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు. ఒవైసీ బ్రదర్స్ వార్నింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని చెప్పారు.

హైడ్రా పేరతో సీఎం రేవంత్, రంగనాథ్ హైడ్రామా చేస్తున్నారని, చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు ఎంఐఎంకు కొమ్ము కాశారని అన్నారు. ఫాతిమా కాలేజ్‌ను కూల్చి సీఎం రేవంత్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాజాసింగ్ సవాలు విసిరారు.

కాగా, హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా తాము కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్లను కూల్చి వేయడం ఏంటని బాధితులు వాపోతున్నారు.

బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్.. : మంత్రి లోకేశ్

ట్రెండింగ్ వార్తలు