Uttam Kumar Reddy (1)
Uttam Kumar Reddy : ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో మోదీ, కేసీఆర్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత తెలంగాణ కోసం పోరాటం చేశారు కానీ, రాష్ట్రం వచ్చిన తరువాత కూడా నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు. గతంలో 25 లక్షల నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందని తెలిపారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వాలేదని ఎద్దేవా చేశారు. 80వేల 39 పోస్టులు భర్తీ చేస్తానని, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ, ఈ ఏడాదిలో ఒక్కటి కూడా చెయ్యలేదని విమర్శించారు. 3 లక్షల ఉద్యోగులున్నారని, ఇంకా లక్ష 50 వేల పోస్టులు శాంక్షన్ పోస్టులున్నాయని తెలిపారు.
Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అయిందని విమర్శించారు. పేపర్ లీక్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. 503 గ్రూప్ -1 పోస్టులకు మూడున్నర లక్షల మంది అప్లై చేశారని పేర్కొన్నారు. 17 వేల పోలీస్ ఉద్యోగాలకు 12 లక్షల మంది అప్లై చేసుకున్నారంటే తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
ప్రభుత్వ యూనివర్సీటీలో సిబ్బంది లేరని, కనీస వసతులు లేవని విమర్శించారు. కేసీఆర్ తన అనుచరులకు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడం తప్పా చేసిందినేమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చెయ్యలేదని విమర్శించారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ఇదే కారణం అని అన్నారు.
Congress MP Uttam : గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ మోసగిస్తున్నాయి : ఎంపీ ఉత్తమ్
మోడీ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ అన్నారని తెలిపారు. 7 ఏళ్ల కాలంలో 18 కోట్ల ఉద్యోగాల భర్తీ చెయాలి కానీ, మోడీ చేసిన పనులకు చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ నిరుద్యోగులకు అండగా ఉండడానికి వస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తే నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.