Corona Positive : కాశీకి వెళ్లారు..కరోనా తెచ్చారు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనాసాగుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలంలో కరోనా కలకలం రేగింది.

Corona positive for 20 people : తెలంగాణలో కరోనా విజృంభణ కొనాసాగుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలంలో కరోనా కలకలం రేగింది. కాశీయాత్రకు వెళ్లొచ్చినవారు కరోనా బారిన పడ్డారు. కాశీవిశ్వనాథుడి దర్శనానికి వెళ్లొచ్చిన 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

తెలంగాణలో గత 24 గంటల్లో 2 వేల 478 కరోనా కేసులు రికార్డు కాగా..ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 472 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 402, మేడ్చల్ లో 208, నిజామాబాద్ జిల్లాలో 176 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. వైరస్ కారణంగా.. పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1.31 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూడగా..802 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 9.74 లక్షలుగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు