couple ends life itself
Couple Ends Life Itself : మెదక్ జిల్లా నర్సాపూర్ లో విషాదం నెలకొంది. సంతానం కలగలేదని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవిష్యత్ లో కూడా తమకు పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అహ్మద్ నగర్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మద్ నగర్ కు చెందిన నీరుడి లక్ష్మణ్, రాణి ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు.
అప్పులు కూడా ఎక్కువ అయ్యాయి.
సంతానం కలగకపోవడం, భవిష్యత్ లో పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతోపాటు అప్పులు అధికమవ్వడంతో దంపతులు మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
కుటుంబ సభ్యులు, బంధువులు వారిని చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ రాణి ఆదివారం రాత్రి 8 గంటలకు, లక్ష్మణ్ సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.