తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. జూడాల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. వారు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను నెరవేరుస్తున్నామని చెప్పారు.
మొత్తం 3 మెడికల్ కాలేజీలకు సంబంధించిన 204.85 కోట్ల రూపాయల నిధులకు ఉత్తర్వులను జారీ చేసినట్లు వివరించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని తెలిపారు.