SIR KTR Family : ఓటరు జాబితా సవరణలో కేటీఆర్ కుటుంబం.. SIRపై వీడియో వైరల్
SIR KTR Family : తెలంగాణలో సర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో కేటీఆర్ కుటుంబం పాల్గొంది. ఈ సందర్భంగా తమ ఓటరు వివరాలను కుటుంబ సమేతంగా పూర్తి చేసి అధికారులకు అందజేశారు.
SIR KTR Family
- సర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో కేటీఆర్ కుటుంబం
- ఎన్యుమరేషన్ ఫారంలో ఓటు వివరాలను నింపిన అందజేత
- ఓటు వివరాలను నింపిన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు
SIR KTR Family : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR) కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఓటరు నమోదు ప్రక్రియలో తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంగళవారం (జూలై 14) ఆయన తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేశారు. ఆపై సంబంధిత ఎన్నికల అధికారులకు కూడా అందజేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు ప్రాధాన్యతను ఆయన గుర్తుచేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేటీఆర్తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా తమ ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారాల్లో నమోదు చేశారు. ఆపై ఎన్నికల అధికారులకు ఫారాలను కూడా సమర్పించారు. కుటుంబ సభ్యులంతా ఈ సర్ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : CM Revanth Reddy- Nitin Gadkari : ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్.. గడ్కారితో సీఎం రేవంత్ కీలక భేటీ
కేటీఆర్ కుటుంబం సర్ ప్రకియలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సైతం ఈ సర్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా సాధారణ ఓటర్లలో అవగాహన పెరుగుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో పాల్గొన్నారు. మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన సతీమణి శ్రీమతి శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా తమ వివరాలను ఎన్నికల అధికారులకు అందజేసి… pic.twitter.com/p1qsnbsgjC
— Ibrahim Khan (@IbrahimKhanHyd) July 14, 2026
‘సర్’ కార్యక్రమం ఎందుకంటే? :
సర్ ఓటరు ప్రకియ అనేది అత్యంత ముఖ్యం.. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంతో ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా రూపొందించవచ్చు. ఇందులో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండాలి.
ఏదైనా తప్పులు లేదంటే మార్పులు అవసరమైతే ఇప్పుడే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి ఓటరు తమ వివరాలను తప్పక పరిశీలించుకోవాలి. అవసరమైన మార్పులను సైతం నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు.. ఓటరు జాబితా సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం చాలా కీలకమని అంటున్నారు అధికారులు. అయితే తమ ఓటు వివరాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
