ప్రశాంతంగా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్, ఉ.11 గంటల వరకు 34శాతం ఓటింగ్ నమోదు

  • Publish Date - November 3, 2020 / 12:31 PM IST

dubbaka by poll polling percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకు 34.33శాతం పోలింగ్ పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.




https://10tv.in/dubbaka-bye-elections-started-in-siddipet/
ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు:
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. దుబ్బాక మండలం బొప్పాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, తొగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీరి మధ్యనే నెలకొంది.

టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ:
మొత్తం 315 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఉన్నతాధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ కేడర్‌ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశంపై అంతటా చర్చలు నడుస్తున్నాయి.
https://10tv.in/fake-vote-in-dubbaka-by-poll/