Etala Rajender – Komatireddy : ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి దూరంగా.. ఈటల, కోమటిరెడ్డితోపాటు పలువురు సీనియర్లు

బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలు పాల్గొనకపోవటంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Etala Rajender - Komatireddy

Door-To-Door BJP Program : భారతీయ జనతా పార్టీ ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. పలువురు బీజేపీ అసంతృప్త నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జిట్టా బాలకృష్ణ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సహా పలువురు సీనియర్లు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.

ఒకే రోజు 35లక్షల కుటుంబాలను కలిసేలా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ సహా పలువురు బీజేపీ నేతలు ఇంటింటికీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలు పాల్గొనకపోవటంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

CM KCR : కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

గత కొన్ని రోజులుగా ఈటల, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా చేపట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి కూడా వారు దూరంగా ఉన్నారు.  అయితే, చేరికల కమటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ మౌనంపై బీజేపీలో చర్చ సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు