Rail Accident: రైలు ఢీ కొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి

కృష్ణ పనిచేస్తుండగా అతడి కుమార్తెలు రైల్వే పట్టాలపై ఆడుకున్నారని, అదే సమయంలో రైలు అటుగా..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ గ్రామంలో రైల్వే స్టేషన్‌లో తండ్రి, ఇద్దరు కుమార్తెలను రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో
ముగ్గురూ మృతి చెందాడు. మృతుడిని మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీని చెందిన కృష్ణగా పోలీసులు గుర్తించారు.

అతడు రైల్వే లైన్ మన్‌గా పని చేసేవాడని తెలిపారు. ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకుని కృష్ణ పనికి వచ్చాడని అదే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.

కృష్ణ పనిచేస్తుండగా అతడి కుమార్తెలు రైల్వే పట్టాలపై ఆడుకున్నారని, అదే సమయంలో రైలు అటుగా రావడాన్ని గమనించిన కృష్ణ ఇద్దరు కూతుర్లను కాపాడబోయాడని తెలిపారు. ఆ ప్రయత్నంలో కృష్ణతో పాటుఅతడి ఇద్దరు కూతుళ్లు మృతి చెందారని చెప్పారు. మృతి చెందిన అమ్మాయిల పేర్లు వర్షిత, వరిణిగా పోలీసులు గుర్తించారు.

Also Read: ఇది ప్రమాదం కాదు.. చనిపోదామనే హైవే పైకి వచ్చా: మాధురి

ట్రెండింగ్ వార్తలు