తనపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసుపై ఇవాళ రాత్రి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
“పచ్చకామెర్ల వారందరికీ లోకమంతా పచ్చగానే కనపడుతుంది. కక్ష సాధింపు కేసు అని తెలిసినప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యాను. నాకున్న రాజ్యాంగబద్ధమైన హక్కులను వినియోగించుకుంటాను. సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తాం. నా హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారు.
చట్టాన్ని గౌరవించే పౌరుడిలా విచారణకు హాజరయ్యాను. విచారణకు లాయర్లతో రావద్దని చెబుతున్నారు. న్యాయవాదుల సమక్షంలతో విచారణ జరిగితే తప్పేంటి? ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతాను. ఏ విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధమే. ఈ కేసులో చర్చకు సిద్ధం. విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం కాంగ్రెస్ విధానం
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్ కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. నేను ఏ తప్పూ చేయలేదు. ఏ విచారణకైనా సిద్ధం. అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే రేవంత్ రెడ్డి పారిపోయారు” అని కేటీఆర్ చెప్పారు.
కేటీఆర్ కామెంట్స్