RGIA - Hyderabad
RGIA – Hyderabad: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికుల వెంట వచ్చి, వారికి స్వాగతం, వీడ్కోలు పలికే వారికి ఆ ఎయిర్పోర్టు (Hyderabad Airport) ఓ విజ్ఞప్తి చేసింది.
ప్రయాణికుల కోసం వచ్చే వారి స్నేహితులు, బంధువుల వల్ల ఎయిర్పోర్ట్ ప్రాంతంలో పార్కింగ్ స్థలంతో పాటు ఇతర పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఫారన్ వెళ్తున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఇటీవల వారి వల్ల ఎయిర్పోర్టు ప్రాంతంలో రద్దీ పెరిగిందని చెప్పింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వారి బంధుమిత్రులు పరిమితంగా రావాలని విజ్ఞప్తి చేసింది. కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువ కావడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
Traffic Advisory!#FlyHYD #HYDAirport #Advisory #TrafficAdvisory #Passenger #AirportSecurity pic.twitter.com/hluKwd4F14
— RGIA Hyderabad (@RGIAHyd) August 4, 2023
Ananthapuram Accident : మద్యం మత్తులో డ్రైవింగ్, అతి వేగం ముగ్గురిని బలి తీసుకుంది