మొత్తం 6 ఎకరాలు కబ్జా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలో కొనసాగుతున్న కూల్చివేతలు

ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు.

Malkajgiri MLA Marri Rajasekhar Reddy

Illegal Constructions : మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కొనసాగుతున్నాయి. దుండిగల్ లోని చిన్నదామర చెరువును కబ్జా చేసి కళాశాల భవనాలు నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు. మొత్తం 6 ఎకరాలు కబ్జా చేశారని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలో కూల్చివేతలు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో మేము ఎల్ఆర్ఎస్ కు అప్లికేషన్ పెట్టుకున్నాము, అది సుప్రీంకోర్టులో ఉందన్నారు. వారం రోజుల క్రితం తమకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులకు తాము రిప్లయ్ ఇచ్చామని, అయినా కూల్చివేతలకు దిగడకం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

Also Read : మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

 

ట్రెండింగ్ వార్తలు