Revanth Reddy : ఎన్నికల్లో గెలిచేందుకు కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం : రేవంత్ రెడ్డి

ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయని పేర్కొన్నారు.

Revanth Reddy Criticism CM KCR

Revanth Reddy – CM KCR : బీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ పెట్టుబడులు పెట్టిందని ఆరోపించారు. వాటాలు పొందుతున్న బీజేపీ.. కాంగ్రెస్ ను నిందించడం తప్ప ఏం చేయగలరని ప్రశ్నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులు అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. సానుభూతి పవనాలతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు కూతురిని కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలనుకునే వ్యక్తి కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు.. ఇందుకు కేసీఆర్ మోదీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.

Revanth Reddy : ఆ ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడింది, అందుకే ఇండియా పేరు మారుస్తాం అంటున్నారు- రేవంత్ రెడ్డి

ఏ లక్ష్యంతో అయితే సోనియా తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. ఆ లక్ష్యాన్ని, కలను నెరేవేర్చేందుకే ఇవాళ విజయభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ సభలకు లేని ఆంక్షలు కాంగ్రెస్ కే ఎందుకని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించడం.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయని పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే ఇవాళ ఆ మూడు పార్టీల సభలు, కార్యక్రమాలు అని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఈగ వాలనివ్వడం లేదన్నారు. ఈడీ, సీబీఐ ఒక్క కేసు కూడా పెట్టలేదని చెప్పారు.

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. ఆమె వల్లే అప్పట్లో కేసీఆర్ ఎంపీ అయ్యారన్న రేవంత్ రెడ్డి

కేసీర్ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని నిలదీశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ కేసులో కవిత ఇరుక్కున్నారని.. అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. సోనియా, రాహుల్ ను ఈడీ వేధించింది కనిపించడం లేదా అని అడిగారు. రూ.100 కోట్లకే మంత్రులను జైలుకు పంపితే మరి లక్ష కోట్ల రూపాయలు తిన్న కేసీఆర్ ను ఉరేయాలన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు సభలోనే శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.

Revanth Reddy : సమాజానికి ఆయన అవసరం ఎంతో ఉంది, కేసీఆర్‌ని తరిమికొట్టడానికి అంతా ఏకమవుతున్నాం- రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నామని చెప్పారు. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు