Krishna Water: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్ కానుంది. విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండడంతో కృష్ణా జలాల పంపింగ్ను దాదాపు 6 గంటలు నిలిపివేస్తామని వాటర్బోర్డు అధికారులు చెప్పారు.
బల్క్ ఫీడర్ల నిర్వహణతో పాటు పాడైపోయిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనుండడంతో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా ఫేజ్ 1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ను సరఫరా చేసేవాటిలో ఈ పనులు జరుగుతున్నట్లు వివరించారు. నాగార్జున సాగర్ నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లకు రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పవర్ నిలిపివేస్తారు. (Krishna Water)
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్ల కోసం కీలక సమావేశం