Road Accident : మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భర్త ఎదుటే భార్య మృతి
మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
- bheemraj
- Published On : October 7, 2023 / 05:10 PM IST
Rajendranagar Road Accident
Road Accident – Woman Died : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందారు. రాజేంద్రనగర్ టీఎస్పీఏ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందారు. భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. భర్త ఎదుటే భార్య మృతి చెందారు. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు
దీంతో ముందు వెళ్తున్న బైక్ సడన్ గా నిలపడంతో వెనకాల నుండి మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కాగా, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందారంటూ ఆరోపిస్తున్నారు.
