Minister KTR : బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
- bheemraj
- Published On : May 13, 2022 / 04:51 PM IST
Ktr (2)
KTR defamation suit : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు బండి సంజయ్ కు కేటీఆర్ నోటీసులు పంపారు. ఈ నెల 11న ట్విట్టర్ లో కేటీఆర్ పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
బండి సంజయ్ పట్టించుకోకపోవడంతో కేటీఆర్ లాయర్ నోటీసులు ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను కేటీఆర్ కు ఆపాదించేయత్నం చేశారని న్యాయవాది అన్నారు.
