MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే సమయంలో ఫోన్లను చూపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదన్న సంకేతాన్ని ఇచ్చారు. “ఇవిగో ఫోన్లు.. నేనెక్కడ ధ్వంసం చేశా?” అన్నట్లుగా ఆమె వ్యవహరించారు.
ఆ ఫోన్లను కవర్లలో పెట్టుకుని తన వద్దే ఉంచుకున్నారు. ఆ ఫోన్లను ఈడీకి చూపించడానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాలయం వద్ద కారు దిగిన సమయంలోనూ కవిత ఆ ఫోన్లను మీడియాకు చూపించారు. కాగా, ఇవాళ ఉదయం న్యాయనిపుణులతో కవిత చర్చించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఈ నెల విచారణకు హాజరు అవుతుండడం ఇది మూడవసారి. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి పలువురు బీఆర్ఎస్ నేతలు వచ్చారు. నిన్న అరుణ్ పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
సౌత్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు, డీలర్ కమిషన్ పెంచడం, లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులపై ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది.
Lok Sabha elections-2024: ఇలాగైతే బీజేపీని వచ్చే ఎన్నికల్లోనూ ఓడించలేం: ప్రశాంత్ కిశోర్