New super luxury buses to be made available to passengers
TSRTC: తెలంగాణ రోడ్లపై ఇక నుంచి కొత్త లగ్జరీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం లగ్జరీ వెర్షన్ బస్సులు ఆర్టీలో ఉన్నప్పటికీ.. అధునాతన లగ్జరీ బస్సులను తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుక్రవారం ప్రకటించింది. ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీఎస్ఆర్టీసీ కృషి చేస్తోందని, అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని యాజమాన్యం పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
Siddique Kappan: ఎట్టకేలకు సిద్ధిఖీ కప్పన్కు బెయిల్.. రెండేళ్లు జైలులోనే మగ్గిన కేరళ జర్నలిస్ట్
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై కొన్ని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంబించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ (ఎమ్మెల్యే), రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారట.
Ram Setu: రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం షాకింగ్ ఆన్సర్
ట్రాకింగ్ సిస్టం.. పానిక్ బటన్!
కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారట. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించి, వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్ను నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే, ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేశారు. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు.