Siddique Kappan: ఎట్టకేలకు సిద్ధిఖీ కప్పన్‭కు బెయిల్.. రెండేళ్లు జైలులోనే మగ్గిన కేరళ జర్నలిస్ట్

యూపీలోని హత్రాస్‭లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాతన అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు దొంగచాటుగా తీసుకువచ్చి, రహస్య ప్రదేశంలో తగలబెట్టారు.

Siddique Kappan: ఎట్టకేలకు సిద్ధిఖీ కప్పన్‭కు బెయిల్.. రెండేళ్లు జైలులోనే మగ్గిన కేరళ జర్నలిస్ట్

Kerala Journalist Siddique Kappan Gets Bail After 2 Years In UP Jail

Siddique Kappan: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‭లో ఒక దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లి, ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలతో జైలు పాలైన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‭కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అతడిపై ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి రెండేళ్ల క్రితం జైలుకు పంపారు. అయితే అనేకసార్లు అతడు బెయిల్‭కు ప్రయత్నించినప్పటికీ అది లభించలేదు. తాజాగా బెయిల్ మంజూరు చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ముడు రోజుల్లోపు ట్రయల్ కోర్టులో హాజరుపర్చి బెయిల్ మీద విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Abdul Bari Siddiqui: ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, విదేశాల్లోనే సెటిలవ్వమని నా పిల్లలకు చెప్పాను.. ఆర్జేడీ నేత సిద్ధిఖీ

చాలా కాలంగా కప్పన్ అనేక బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నటప్పటికీ.. కోర్టు తోసిపుచ్చింది. అయితే తాజాగా అతడి అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో మత విధ్వేషాలు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కుట్రలో భాగంగా హత్రాస్‭కు కప్పన్ వచ్చాడని యూపీ ప్రభుత్వం తెలిపింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కప్పన్‭కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణను పరిశీలించిన అనంతరం, కప్పన్‭కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్‭కడ్

రెండేళ్ల క్రితం.. యూపీలోని హత్రాస్‭లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాతన అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు దొంగచాటుగా తీసుకువచ్చి, రహస్య ప్రదేశంలో తగలబెట్టారు. అప్పట్లో ఇది దేశాన్ని కుదిపివేసింది. ఆ సమయంలో దీనిపై రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన కప్పన్‭ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఉపా కింద కేసు నమోదు చేశారు.