×
Ad

Telangana Governor : గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు.. అనవసరంగా విమర్శిస్తున్నారు

రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం...

  • Published On : April 18, 2022 / 02:30 PM IST

Tamilisai

Governor Tamilisai Key Comments : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్ మధ్య దూరం పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేసిన దరిమిలా.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో… 2022, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం గవర్నర్ తమిళి సై ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజా ప్రతినిధులపై కీలక వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని, పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను ప్రభుత్వం రద్దు చేస్తా అని అనలేదని, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తానని, రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదు.. చెయ్యాలనే ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టారు.

Read More : Satyavathi Rathod: గవర్నర్ తమిళిసై ఆంతర్యం ఏంటో అందరికి అర్ధం అవుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్

రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారన్నారు.  ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటo తన లక్ష్యమని స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదనే విషయంలో ఆమె స్పందించారు. ప్రోటోకాల్ విషయంలో కేంద్రం తన పని తాను చేసుకపోతుందని, గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతోందన్నారు. తన ఆహ్వానాలకు రాజకీయాలను ఆపాదించడం అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విషయంలో ప్రతి నెలా నివేదికలు కూడా ఇస్తున్నట్లు, నివేదికలో అన్ని విషయాలను పేర్కొనడం జరుగుతోందన్నారు. ప్రజల గురించి, దేశానికి ఏమి చేయాలనే విషయాలను తాను ఆలోచించడం జరుగుతుందన్నారు గవర్నర్ తమిళి సై.