Road Accident : డ్రంకెన్ డ్రైవ్ నిండు ప్రాణం తీసింది.. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్

వారం రోజులపాటు నిందితుడు పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు.

Road Accident One Died

Road Accident One died : డ్రంకన్ డ్రైవ్ చేయొద్దని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కొంతమంది మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న వారి ప్రాణాలు తీస్తున్నారు. పోలీసుల హెచ్చరికలు, సలహాలు, సూచనలను పట్టించుకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది.

డ్రంకెన్ డ్రైవ్ ఒక నిండు ప్రాణం తీసింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మద్యం మత్తులో పవన్ రెడ్డి అతివేగంగా కారు నడిపి యాక్సిడెంట్ చేశారు. నిందితుడు పవన్ రెడ్డి యాక్సిడెంట్ చేసి కారుతో సహా పరారయ్యాడు.

Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఈ ప్రమాదంలో పోషం కృష్ణారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులపాటు నిందితుడు పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు. కారు యజమాని వరాల స్వేతారెడ్డిగా గుర్తించారు. యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ TS08EZ6717 వైట్ బెంజ్.

అయితే, పోలీసులు తూతూ మంత్రంగా మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. యాక్సిడెంట్ కు కారణమైన భార్యాభర్తలు పవన్ రెడ్డి, స్వేతారెడ్డిలపై హత్య కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబం పట్టుబడుతున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు