Bharat Jodo Yatra: మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. నాలుగో రోజు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిశారు. ఇవాళ మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 20.3 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర ఉంటుంది. ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు.

Rahul Gandhi skips gujarat and himachal assembly elections

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. నాలుగో రోజు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిశారు. ఇవాళ మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 20.3 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర ఉంటుంది.

ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. నిన్న రాహుల్ గాంధీ నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో పాదయాత్ర కొనసాగించారు.

దీపావళి, కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వేళ మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతూ ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..