హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. బాబోయ్.. దొంగలు బంగారం దుకాణంలోకి ప్రవేశించి.. తుపాకులు గురిపెట్టి

హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చందానగర్ లోని జ్యూవెలరీ షాపులో ..

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. బాబోయ్.. దొంగలు బంగారం దుకాణంలోకి ప్రవేశించి.. తుపాకులు గురిపెట్టి

Gunfire

Updated On : August 12, 2025 / 12:24 PM IST

Hyderabad: కాల్పుల కలకలం హైదరాబాద్ నగర వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి యత్నించారు. వారు తుపాకులతో ఒక్కసారిగా దుకాణంలోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అక్కడున్న సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై రెండు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకున్నారు. ఆలోపే దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. ఈ దాడిలో దుకాణ సిబ్బందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ మేనేజర్ కాళ్ళపై దుండగులు కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగల ముఠాలో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా తుపాకులతో దుకాణంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులకు తెగబడ్డారు.

ఘటన అనంతరం దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయారు. వారికోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కూకట్‌పల్లిలో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ పాల్పడిన నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులను సైబరాబాద్ సీపీ అలర్ట్ చేశారు. అయితే, దుకాణంలో భారీగా గోల్డ్ చోరీ అయినట్లు తెలుస్తోంది.