CM Revanth Reddy : అక్కడ కేసీఆర్, ఇక్కడ హరీశ్ రావు బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు.

CM Revanth Reddy On Power Issue

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యుత్ రంగంపై చర్చ హాట్ హాట్ గా నడిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. విద్యుత్ బకాయిల అంశంలో విపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. బకాయిల విషయంలో మొదటి స్థానంలో సిద్ధిపేట (61.37%), రెండో స్థానంలో గజ్వేల్ (50.29%), మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ (43 శాతం) ఉన్నాయని తెలిపారు. సిద్ధిపేటలో హరీశ్ రావు, గజ్వేల్ లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్.. బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

”బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్ 1న సబ్ స్టేషన్లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి ఆయనకు గుర్తు చేస్తున్నా. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బీఆర్ఎస్ పాలనలోనే. కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే.

Also Read : విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణ.. 24 గంటల కరెంట్ పై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు. ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుంది. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించ లేదు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు.

మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పని లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం. ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : నాంప్లలి కోర్టులో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు షాక్.. మరో 16 మంది అరెస్ట్