×
Ad

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ పూర్తి.. ఎంతమంది దొరికిపోయారంటే? ఇక ఆ డబ్బంతా బాధితులకు తిరిగి..

చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నారు.

Telangana Police: సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు ఇటీవల తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ ముగిసింది. 5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్ నిర్వహించింది. రూ.95 కోట్లు మోసం చేసిన 81 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసింది.

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వారు దొరికారు. వీళ్లు దేశ వ్యాప్తంగా 754 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.95 కోట్ల మేర మోసాలకు పాల్పడింది ఈ ముఠా. (Telangana Police)

నిందితుల ఖాతాల్లోని కోట్లాది రూపాయలు ఫ్రీజ్ చేసిన పోలీసులు డబ్బును బాధితులకు తిరిగి అందజేస్తామని చెప్పారు. తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్ల కదలికలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెట్టింది.

Also Read: జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం.. వణికిపోయిన ప్రజలు.. సునామీ హెచ్చరికలు జారీ..

ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ బ్యూరో దాడులు నిర్వహించింది. అరెస్టయిన వారిలో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు, 58 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు.

నిందితుల నుంచి పోలీసులు 84 సెల్‌ఫోన్లతో పాటు 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నారు.