ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
- Sreehari A
- Published On : September 30, 2020 / 09:03 PM IST
pay cut salaries to Employees : రాష్ట్రంలోని ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ కోత విధించిన వేతనాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ లో కోత విధించిన వేతనాలను ప్రభుత్వం చెల్లించనుంది. మిగతా ఉద్యోగులకు నాలుగు విడతల్లో (Telangana govt )ప్రభుత్వం చెల్లించాలని భావిస్తోంది.
ఇక పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ నెలలో రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
