తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది జనసేన. 8మందితో లిస్ట్ ను ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది. జనసేన పోటీ చేస్తున్న స్థానాలు, అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి..
కూకట్ పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు – నేమూరి శంకర్ గౌడ్
కోదాడ – మేకల సతీశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ – వంగ లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం – మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ)- డా.తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి.
Also Read : బీజేపీ సభలో ఇంట్రస్టింగ్ సీన్.. పక్కపక్కనే ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్.. పవన్తో ఏం మాట్లాడారు?
పొత్తులో భాగంగా 8 అసెంబ్లీ స్థానాలు జనసేకు ఇచ్చేందుకు ఇదివరకే బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జనసేన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగనున్న ప్రేమ్ కుమార్ మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. నిన్ననే ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రేమ్ కుమార్ బీజేపీ నుంచి కూకట్ పల్లి టికెట్ ఆశించారు.
కాగా, 9 సీట్లు కేటాయించాలని జనసేన పట్టుబట్టినా.. 8 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది. శేరిలింగంపల్లి స్థానం కూడా తమకే ఇవ్వాలని జనసేన అడిగినా.. అందుకే బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు. శేరిలింగంపల్లి స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడంతో ఆ పార్టీ పెద్దలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.
Also Read : హైదరాబాద్లో ప్రధాని మోదీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది?