telangana police department suspends dsp praneet rao
Telangana Police : ఎన్నికల వేళ తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి (మార్చి 4)న ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో అధికార దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో రాష్ట్ర పోలీసు శాఖ విచారణ చేపట్టింది. అనంతరం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ప్రణీత్ రావ్ పనిచేస్తున్నారు.
Read Also : Chandrababu Naidu : టీడీపీ-జనసేన పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఈయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ తెలంగాణ పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ప్రణీత్ రావ్ను విధుల నుంచి తప్పించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also : Hyderabad Old City Metro : పాతబస్తీకి మెట్రో.. 8న నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన, రూ.2వేల కోట్లతో..