Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 19వేల 846 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 192 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 543గా ఉంది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32వేల 834 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 705 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 355 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 48 కేసులు, కరీంనగర్ జిల్లాలో 42 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 29 కేసులు, హన్మకొండ జిల్లాలో 29 కేసులు, ఖమ్మం జిల్లాలో 21 కేసులు గుర్తించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 531 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 19వేల 846 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 192 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 543గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 38వేల 024 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 851 మందికి పాజిటివ్ గా తేలింది.

Joe Biden Corona : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కు మరోసారి కరోనా..వైరస్‌ నుంచి కోలుకున్న 3 రోజులకే

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు