Telangana CEO Vikas Raj : పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలకోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 1.80లక్షల సిబ్బంది అవసరం అని తెలిపారు. ఇప్పటికే వారి ట్రైనింగ్ ఇచ్చామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో 90వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు తొమ్మిది వేలుగా గుర్తించామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత 8,58,491 ఓట్లు తొలగించామని తెలిపారు. రాష్ట్రంలో చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి అని తెలిపారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రాసెస్ జరుగుతోందని, షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుందని వికాస్ రాజ్ చెప్పారు.