ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు.. ఎందుకో తెలుసా
ఇప్పటికే పలు డిపార్ట్ మెంట్లలో మార్పుల చేసిన ప్రభుత్వం.. త్వరలో అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతం ఇచ్చింది.
- Naveen
- Published On : February 2, 2024 / 01:02 AM IST
Telangana Secretariat Employees Transfers
Telangana Secretariat Employees : పరిపాలన సౌలభ్యం కోసం సెక్రటేరియట్ లో అధికారుల బదిలీలపై తెలంగాణ సర్కార్ మరోసారి దృష్టి సారించింది. మొన్నటివరకు ఆయా శాఖల్లో ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్లపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు డిపార్ట్ మెంట్లలో మార్పుల చేసిన ప్రభుత్వం.. త్వరలో అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతం ఇచ్చింది. దీంతో పదేళ్లుగా ఆయా శాఖల్లో పాతుకుపోయిన ఉద్యోగాల్లో ఆందోళన మొదలైంది.
Also Read : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోకల్, నాన్లోకల్ వార్.. కరీంనగర్లో హీటెక్కిన రాజకీయం
