Dalitbandhu : దళితబంధు నిధులు విడుదల.. ఆ నాలుగు జిల్లాలకు

దళితబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం..దళితబంధు నిధులు విడుదల చేశారు. మరో నాలుగు మండలాల్లో ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

Kcr

Dalitbandhu funds released : తెలంగాణ ప్రభుత్వం నాలుగు జిల్లాలకు.. దళితబంధు నిధులు విడుదల చేసింది. సూర్యాపేట, ఖమ్మం, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌ నగదు జమ చేసింది. నాలుగు మండ‌లాల‌కు క‌లిపి మొత్తం 250 కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

డిసెంబర్ 18న జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దళితబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం..దళితబంధు నిధులు విడుదల చేశారు. మరో నాలుగు మండలాల్లో ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని చెప్పారు. రానున్న మార్చి నెల వరకు దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని చెప్పారు.

Special Status : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ

ప్రతి నియోజకవర్గంలో కచ్చితంగా వంద మందికి దళితబంధు సాయం అందేలా చూడాలని ఆదేశించారు. దళితబంధు విషయాన్ని సూచించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. దళిత సమాజం తలెత్తుకుని జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు ఇప్పటికే నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలో కూడా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. దళితులు ఎప్పుడైతే ఆర్థికంగా బాగుపడుతారో అప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Disney+ Hotstar : డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్.. రూ.49కే మెంబర్‌షిప్!

దీనికి సంబంధించి కలెక్టర్లు కూడా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా దళిత సమాజానికి సంబంధించిన పెద్దలు గానీ, ఆ సమాజానికి సంబంధించిన నేతలు గానీ క్షేత్రస్థాయిలో వెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు. దళితులు వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. వ్యాపార మార్గాలకు సంబంధించి కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని సూచించారు.

దళిత సమాజం బాగుపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముందస్తు ప్రణాళికలు రచించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశించారు. దళితుల ఆర్థిక ప్రగతి ద్వారానే వారి జీవన విధానంలో మార్పులు వస్తాయని సూచించారు. కచ్చితంగా దళితబంధు అమలు విషయంలో ఇటు హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి దళితబంధును అమలు చేస్తున్నామని చెప్పారు.