Amit Shah Ujjaini Ammavari Temple : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు చేశారు. అమిత్ షా వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఉన్నారు.
మునుగోడు ఉపఎన్నిక వేళ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి అమిత్ షా వెళ్లనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.20 రమదా మనోహర్ హోటల్ కు చేరుకోనున్నారు.
Amit Shah – Jr.NTR Meeting : అమిత్ షా నుంచి జూ.ఎన్టీఆర్కి పిలుపు
సాయంత్రం 4 గంటల వరకు రైతు నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మునుగోడుకు అమిత్ షా బయల్దేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అమిత్ షా మునుగోడుకు చేరుకోనున్నారు.