Minister Rajnath Singh : తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదు బీజేపీ కూడా పోరాడింది : రాజ్ నాథ్ సింగ్

అభివృద్ది మంత్రంతోనే గుజరాత్ లో బీజేపీ 27ఏళ్లుగా అధికారంలో ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా గుజరాత్ మారిందని అన్నారు.

BJP Public Meeting from Jammikunta Rajnath Singh

BJP  Jammikunta Rajnath Singh :  తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదు బీజేపీ కూడా పోరాడింది అంటూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కరీంనగర్ లోని జమ్మికుంటలో బీజేపీ జన గర్జన సభలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు సంధించారు.

కేసీఆర్ పాలనలో అవినీతి భారీగా పెరిగిపోయింది అంటూ విమర్శించారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబమే అన్నట్లుగా మార్చేశారని తెలంగాణ తెచ్చింది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ మాత్రమే అన్నట్లుగా మార్చేశారని రాష్ట్రం కోసం బీజేపీ కూడా పోరాడింది అంటూ చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని..బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని కానీ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఉన్న తెలంగాణ మాత్రం అభివృద్ధి ఎందుకు చెందటంలేదో చెప్పాలన్నారు.

Narayanaswamy : భువనేశ్వరి, పురందేశ్వరిలపై డిప్యూటి సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

అభివృద్ది మంత్రంతోనే గుజరాత్ లో బీజేపీ 27ఏళ్లుగా అధికారంలో ఉంటోందని అన్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా గుజరాత్ మారిందన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడితే స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎందుకు ఉద్యోగాలు కల్పించలేదు..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు అంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వంగా మారిపోయింది అంటూ ప్రశ్నాపత్రాల లీకేజీలను దృష్టిలో పెట్టుకుని సెటైర్లు వేశారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.

ట్రెండింగ్ వార్తలు