cheating : పెళ్లి చేసుకుంటా, ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని నమ్మించి..

ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి రూ.7.55 లక్షలు స్వాహా చేశాడో మోసగాడు. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

young man cheating Rs 7.55 lakh from a young woman : ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి రూ.7.55 లక్షలు స్వాహా చేశాడో మోసగాడు. మ్యాట్రీమోని వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమై, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.55 వేలు దండుకోవడమే కాకుండా.. తన పేరిట ఓ కార్పొరేట్‌ బ్యాంక్‌లో ఖాతా తెరిపించి దగా చేశాడంటూ ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె ప్రొఫైల్‌ను మ్యాట్రీమోనిలో పెట్టారు. సాయి కల్యాణ్‌ అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. అతనిది గుంటూరు, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నానని, పెద్ద కంపెనీలో జీఎం హోదాలో పని చేస్తున్నానని చెప్పాడు. తల్లిదండ్రులు నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, ఉన్నత కుటుంబం అని చెబుతూనే.. మీరు బాగా నచ్చారని చెప్పాడు. మీ స్థాయికి మేము తూగలేము కాబట్టి నేనీ సంబంధం వద్దనుకుంటున్నానని యువతి కరాఖండిగా చెప్పేశారు.

మీరు పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు కదా.. తనకో మంచి ఉద్యోగం ఇప్పించగలరా.. అని యువతి కోరింది. తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి.. తనకు ట్రేడింగ్‌లో మంచి అనుభవం ఉందని, మీరు సరే అంటే.. మంచి లాభాలు ఇప్పిస్తానని చెప్పాడు. తరువాత బెంగళూరులో తనకు బ్యాంక్‌ ఖాతా వాడుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీ పేరిట ఖాతా తెరిచి ఇవ్వండని చెప్పాడు. అక్కడైతే మా కంపెనీకి సంబంధించి లావాదేవీలకు ఇబ్బంది ఉండదని చెప్పాడు. ఈమేరకు ఆమె ఖాతా తెరిచారు. డెబిట్‌ కార్డు పంపిస్తే.. బెంగళూరులోనే విత్‌డ్రా చేసుకుంటానని చెప్పడంతో డెబిట్‌ కార్డును కేఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఇచ్చి పంపించారు.

డబ్బు డ్రా చేస్తున్నప్పుడు వచ్చే ఓటీపీలు అతనికి చెప్పేది. మీ ఉద్యోగం కోసం ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతరత్రా ఖర్చుల కోసమని రూ.55 వేలు తన ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్‌ చేయడం ఆపేశాడు. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన 20 రోజుల్లోనే రూ.7 లక్షల వరకు బెంగళూరులోని నెక్స్ట్‌ లెవల్‌ కంపెనీకి బదిలీ అయ్యాయి. కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఖాతా తెరిస్తే పనిచేయడానికి కనీసం 24 గంటలు పట్టాల్సి ఉండగా, కేవలం మూడు గంటల్లోనే పనిచేయడం గమనార్హం. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు