Ys Sharmila
YS Sharmila : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చెయ్యాలని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైందని ఆమె విమర్శించారు. విద్యార్థులకు ఏజ్ బార్ అయిపోతున్నా ఉద్యోగ ప్రకటన ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు నామినేషన్ వెయ్యాలని ఆమె కోరారు.
కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి అంటే వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని ఆమె తెలిపారు. ఇక నుంచి నిరుద్యోగుల పక్షాన వైటీపీ తెలంగాణ పార్టీ పోరాటం మరింత ఉదృతం చేస్తుందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడతామని అన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని వ్యాఖ్యానించారు. జాప్యం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల అన్నారు.
KCR కు గుణపాఠం చెప్పాలంటే వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి KCR మెడలు వంచాలని YSR తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇక నుంచి YSR తెలంగాణ పార్టీ నిరుద్యోగ పోరాటం మరింత ఉదృతం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుంది 2/2
— YS Sharmila (@realyssharmila) August 21, 2021