YS Sharmila
YS Sharmila – KCR: కోకాపేట భూముల రేట్లను ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. భూముల గురించి పలు ప్రశ్నలను లేవనెత్తారు.
” భూ బకాసురుడు కేసీఆర్. అడిగేటోడు లేడని సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యం నడుస్తోంది. కావాల్సింది కాజేయడం, ఆదాయం అని ఉన్నది అమ్మేయడం ఇదే రెండు దఫాలుగా కేసీఆర్ నడుపుతున్న భూముల దందా.తనకు నచ్చిన రేటుకే కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నడు.
జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరిట రూ.వెయ్యి కోట్లు విలువజేసే 33.72 ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11ఎకరాలు దోచేశారు. దాదాపు రూ.1100 కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ ఆఫీసుకు లాక్కున్నారు.
ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొర గారి సొంత పార్టీ అవసరాలకు,ఆయన బినామీలకు ఉపయోగ పడుతున్నయ్. హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొనిపోతున్నాడు కానీ దొర గారిలో మార్పు రావడం లేదు.
కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. మీరు రాయించుకున్న అత్యంత విలువైన కొకపేట భూములను వెంటనే ప్రభుత్వ పరం చేయండి. లేదా ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.11వందల కోట్లను మీ పార్టీ అకౌంట్ లో మూలుగుతున్న రూ.12 వందల కోట్ల నుంచి కట్టండి” అని షర్మిల డిమాండ్ చేశారు.