పెద్దకూతురు కోసం బెంగళూరుకు సీఎం జగన్, హ‌ర్షారెడ్డికి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో సీటు

  • Publish Date - August 24, 2020 / 11:05 AM IST

ఏపీ సీఎం జగన్…కుమార్తె కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. 2020, ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఆయన సతీసమేతంగా పయనం కానున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డికి సీటు లభించింది.



దీంతో తన కుమార్తెను పారీస్ పంపేందుకు వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. దాదాపు ఐదు నెలల అనంతరం రాష్ట్రం దాటనున్నారు. కరోనా వైరస్ కారణంగా దాపు ఐదు నెలలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లలేదు.

ఇక సీఎం జగన్ కుమార్తె విషయానికి వస్తే…హార్షారెడ్డి ప్రఖ్యాత London School Of Economicsలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అమెరికా బేస్డ్ MNC లో ఫైనాన్సియల్ కన్సల్టెంట్‌గా ఆఫర్ వచ్చినా..వద్దనుకున్నారు.



Insead Business Schoolలో మాస్టర్స్ చదవడానికి హర్షా మొగ్గు చూపింది. ఆమెను పారిస్ పంపడానికి సీఎం జగన్ మంగళవారం బెంగళూరు వెళ్లనున్నారు. ఫ్లైట్ ఎక్కించిన అనంతరం ఆయన 26వ తేదీన బెంగుళూరులోనే ఉండనున్నారు. 27వ తేదీన తాడేపల్లి గూడెంకు చేరుకుంటారు.


ట్రెండింగ్ వార్తలు