IND vs ENG 2nd Test : విశాఖ మైదానంలో టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ వీడియో వైరల్.. రోహిత్ ఏం చేశాడంటే..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఇవాళ్టి నుంచి విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది.

Teamindia

Teamindia : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఇవాళ్టి నుంచి విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది. విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ- విడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ లో సమఉజ్జీగా నిలవాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. దీంతో మైదానంలో ఎక్కువ సమయం ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

Also Read : IND vs ENG : టీమ్ఇండియాకు భారీ షాక్‌.. సిరీస్ నుంచి కీల‌క ఆట‌గాడు ఔట్‌! కోహ్లీ డౌట్‌!

బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రోహిత్ శర్మతో పాటు.. అశ్విన్, రవీంద్ర జడేజాన, కుల్ దీప్ యాదవ్, కేఎల్ భరత్, శుభ్ మన్ గిల్ తో పాటు ఇతర ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ మైదానంలో ప్రాక్టీస్ చేయడంతోపాటు, ఇతర క్రికెట్లకు సూచనలు చేస్తున్నట్లు చూడొచ్చు. ఇదిలాఉంటే లోకల్ బాయ్ కేఎస్ భరత్ ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై భరత్ మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడటం గర్వపడే సందర్భమే. కానీ, ఆటపైనే నా దృష్టి ఉంటుందని తెలిపాడు. ప్రత్యర్థి బ్యాటర్లు స్వీప్ ఆడకుండా కట్టుబడి చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పరిస్థితులను బట్టి బ్యాటర్ల షాట్ల ఎంపిక ఉంటుంది.. నేను అదేవిధంగా ఆడతానని భరత్ అన్నారు

 

 

ట్రెండింగ్ వార్తలు